నేటి మధ్నాహ్నం 3 గంటలకు లోథి రోడ్ క్రిమిటోరియంలో పూర్తి అధికార లాంఛనాలతో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. ఈ మేరకు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేస్తూ సుష్మాస్వరాజ్ తీవ్ర గుండెపోటుతో మంగళవారం రాత్రి 10.50 గంటలకు ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవాటం తమ పార్టీని శోకసంద్రంలో ముచేసిన్దనై అన్నారు ప్రస్తుతం సుష్మకు నివాళులు అర్పించేందుకు వేలాదిగా నేతలు అభిమానులు తరలి వస్తుండటంతో ఆమె నివాసం వద్ద పార్థివదేహాన్ని ప్రజా సందర్శనార్థం ఉంచామని, 12 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చి అక్కడ ప్రజాసందర్శనార్ధం ఉంచనున్నారు. తదుపరి లోధి రోడ్లోని శ్మశానవాటికలో హిందూ ఆచారాలతో అంతిమ సంస్కారం నిర్వహిస్తామనితెలిపారు. కాగా, సుష్మ హఠాన్మరణంతో ఢిల్లీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది.