ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్‌వోసీ వద్ద హైఅలర్ట్

national |  Suryaa Desk  | Published : Tue, Aug 06, 2019, 09:45 AM

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సైన్యం మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. పాకిస్తాన్ ఎలాంటి దుస్సహసానికైనా ఒడిగట్టే ప్రమాదం ఉందని అధికార వర్గాలు హెచ్చరించాయి. ఆ దేశం ఎలాంటి చర్యలకు పూనుకున్నా.. వాటిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎల్‌వోసీ దగ్గర సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులు, అల్లర్లు జరిగే అవకాశముందన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో నిషేదాఙ్ఞలు విధించగా.. భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com