కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సమయంలో గైర్హాజరు అయిన ఎమ్మెల్యే మహేశ్ను బిఎస్పీ పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ మేరకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఓ ప్రకటన విడుదలచేస్తూ, కర్ణాటకలో అసెంబ్లీలో మంగళవారం రాత్రి జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ ఆదేశింశాలు జారీ చేసినా, తమ ఆదేశాలు ధిక్కరించి ఏకంగా ఓటింగ్కి రాకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించినందున, క్రమశిక్షణ చర్యల కింద మహేశ్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా మహేష్ త్వరలోనే కమలం తీర్థం తీసుకునేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.