ఇసుక అక్రమ తవ్వకాలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, సీబీఐ సహా ఐదు రాష్ర్టాలకు నోటీసులు జారీ చేసింది. తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు సుప్రీం నోటీసులు జారీచేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై సీబీఐ విచారణ జరపించాలంటూ తమిళనాడుకు చెందిన అళగరసామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.