ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతితో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అంశంపై చర్చించారు. నిరసన తెలియజేయడం సభ్యుల హక్కు అని తెలిపారు. నిరసన తెలిపే హక్కు కూడా కాలరాయడం అప్రజాస్వామికమన్నారు. తన స్థానంలోనే ఉన్న అచ్చెన్నాయుడును సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఆరుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన గోరంట్లను తొలిసారి సస్పెండ్ చేశారన్నారు. సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి సస్పెన్షన్ అన్యాయమన్నారు.