కర్ణాటక శాసనసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష నేడు జరుగుతుందని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. మెజారిటీ నిరూపించుకోవడానికి వీలుగా అధికార పక్షానికి తాను కావాలనే అధిక సమయం ఇస్తున్నానని ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలపై స్పీకర్ స్పందించారు. వారికి ధన్యవాదాలు. వారికి కొంత బుద్ధి ఇవ్వాల్సిందిగా భగవంతుడిని కోరుతున్నాను అని స్పీకర్ అన్నారు.