న్యూఢిల్లి : నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సి)కి వివిధ మంత్రిత్వ శాఖలనుంచి ఛైర్ పర్సన్లను నియమించడంపై డిఎంకె ఎంపి కనిమొళి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లోక్సభలో మానవ హక్కుల పరిరక్షణ (సవరణ) బిల్లు 2019పై చర్చలో పాల్గొన్న కనిమొళి కమిటీలలో 20 శాతం మంది మహిళలే ఉన్నారని, ఆ సంఖ్యను 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. మైనారిటీలు, దళితులు, మహిళలు, బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న ఎన్జిఒలను, సామాజిక కార్యకర్తలను ఎన్హెచ్ఆర్సిలో భాగస్వాములను చేయాలని ఆమె కోరారు.