పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న భారత నావికాదళం మాజీ అధికారి కులభూషణ్ జాదవ్కు పాక్ ప్రభుత్వం కాన్సులార్ యాక్సెస్ మంజూరు చేయనున్నది. వియెన్నా కన్వెన్షన్ను ఉల్లంఘించిందని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసిజె) పాకిస్తాన్ను తప్పుబట్టింది. దీనితో కుల్భూషణ్కు కాన్సులార్యాక్సెస్ మంజూరు చేయాలని ఆ దేశం నిర్ణయించింది. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో కుల్భూషణ్కు పాక్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని భారత్ ఐసిజెలో సవాల్ చేసింది.