వైఎస్ హయాంలో పోలవరంలో కేవలం మట్టిపనులే చేశారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… కాంక్రీట్ పనులన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్నారు. టెండర్లు రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని రామానాయుడు అన్నారు. ప్రాజెక్టులు నిలిపివేయడం ద్వారా రైతులకు నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయొద్దని, నిరుద్యోగ భృతి రద్దు చేసి 6 లక్షల మందికి అన్యాయం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ పనిచేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఆక్షేపించారు.