తనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా మొదటగా కోరింది నెల్సన్ మండేలానే అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. నల్లజాతి సూరీడు, వర్ణవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా 101వ జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నెల్సన్ మండేలా తన కొడుకును ఎత్తుకొన్నప్పటి ఫోటోను ప్రియాంక తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆమె స్పందిస్తూ.. నెల్సన్ మండేలా వంటి గొప్ప వ్యక్తులను ప్రపంచం ఇప్పటికి మిస్ అవుతుందన్నారు. ఆయన జీవితం సత్యానికి, ప్రేమకు, స్వేచ్ఛకు ఓ పరీక్ష వంటిదన్నారు. తన వరకు ఆయన అంకుల్ నెల్సన్ అన్నారు. తనకు ఎల్లప్పుడు ప్రేరణ కలిగించే మార్గదర్శకుడు అని పేర్కొన్నారు.