ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండేలానే రమ్మన్నారు: ప్రియాంక గాంధీ

national |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2019, 04:30 PM

తనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా మొదటగా కోరింది నెల్సన్‌ మండేలానే అని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. నల్లజాతి సూరీడు, వర్ణవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్‌ మండేలా 101వ జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నెల్సన్‌ మండేలా తన కొడుకును ఎత్తుకొన్నప్పటి ఫోటోను ప్రియాంక తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆమె స్పందిస్తూ.. నెల్సన్‌ మండేలా వంటి గొప్ప వ్యక్తులను ప్రపంచం ఇప్పటికి మిస్‌ అవుతుందన్నారు. ఆయన జీవితం సత్యానికి, ప్రేమకు, స్వేచ్ఛకు ఓ పరీక్ష వంటిదన్నారు. తన వరకు ఆయన అంకుల్‌ నెల్సన్‌ అన్నారు. తనకు ఎల్లప్పుడు ప్రేరణ కలిగించే మార్గదర్శకుడు అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com