ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైన ఒడిస్సాకు చెందిన విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆయన అంతకు ముందురోజు అంటే ఈనెల 23న తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారని రాజ్భవన్ వర్గాలు చెప్పాయి.. 23న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ తిరుమల శ్రీవారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డుమార్గంలో తిరుమల చేరుకుని, పద్మావతి అతిధి గృహంలో కాసేపు విశ్రాంతి తరువాత వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం రేణిగుంట నుంచి తిరిగి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు.