అసోం రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. బ్రహ్మపుత్ర, దాని ఉప నదులు తీవ్రరూపం దాల్చాయి. పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. బ్రహ్మపుత్ర, సుబాన్సిరి, ధన్సిరి, జియాభరతి, కొపిలి, ధరామ్తుల్, పుతీమరి, బేకి, బరాక్, బాదర్పూర్లు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. గువహటి సహా అసోంలోని 33 జిల్లాలు వరద గుప్పిట్లోకి వెళ్లాయి. అసోం వ్యాప్తంగా 4,620 గ్రామాలు నీట మునిగాయి. వర్ష బీభత్సానికి ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా, 45 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం అసోం రాష్ట్ర వ్యాప్తంగా 226 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసింది. లక్షా రెండువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.