హైదరాబాద్: పది రూపాయల నాణేలు చెల్లవంటూ తెలుగు రాష్ర్టాల్లో వదంతులు ఊపందుకున్నాయి. దీంతో ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. కొన్ని దుకాణాల్లో ఈ నాణేలను స్వీకరించడం లేదు. అలాగే కొందరు కస్టమర్లు కూడా ఈ నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని షాపు యజమానులంటున్నారు. అయితే, రూ.10 నాణేల చట్టబద్ధతపై సందేహాలు అక్కర్లేదని, పుకార్లను నమ్మవద్దని ఆర్బీఐ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ నాణేలతో లావాదేవీలు జరుపవచ్చని స్పష్టం చేసింది.