ఒంగోలు, మేజర్న్యూస్ : లోక కళ్యాణమే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కుటుంబ ధ్యేయమని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వామి స్వరూపానంద స్వామి వెల్లడించారు. సోమవారం స్థానిక అటవీశాఖ మంత్రి రాఘవరావు నివాసాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సంద ర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్ధా రాఘవరావు, ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతిని ఆశీర్వదించారు. జిల్లాలో ప్రజలు అందరూ సంతోషంగా వుండా లని చీమకుర్తిలో హరిహర క్షేత్రం నిర్మించి జాతికి అంకితం చేసారన్నారు. ప్రతి సంవత్సరం దేవాలయ వార్షికోత్సవం నిర్వహించడం పట్ల అభినందించారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా శిద్ధా రాఘవరావు అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రజలందరూ సహకరించాలన్నారు. గోవులు బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.