ముంబై : మహారాష్ట్రలోని ముంబై నగరం పరిధిలోని భేండీ బజార్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని జేజే ఆసుపత్రికి తరలించారు. భేండీ బజార్ లోని భవనంలో అగ్నిప్రమాదం జరిగి మంటలు వ్యాపించడంతో 12 మందిని రక్షించారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అగ్నిమాపకశాఖ అధికారులు మంటలను అదుపు చేస్తున్నారు.