టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాలలో అనంతపురం ఒకటి అనటంలో సందేహం లేదు. కానీ అలాంటి జిల్లాలోనూ ఫ్యాన్ గాలి వీచడంతో మహా మహులు కొట్టుకు పోయారు. ఈ జిల్లాలో కియో మోటార్స్ సంస్ధని ఏర్పాటు చేసినా, పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి ఇచ్చినా, ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు స్వీప్ చేసే పరిస్థితికి వైసిపి చేరటం వెనుక స్ధానిక గ్రూపు రాజకీయాలే అన్నది టివిపి వర్గాల మాట. ఇంత ఎదురుగాలిలోనూ ఇక్కడ టీడీపీకి కేవలం రెండు సీట్లు దక్కించుకుంది. హిందూపురంలో బాలకృష్ణ గెలవగా, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. హిందూపురం నుంచి బాలయ్య.. వైసీపీ అభ్యర్థి ఇక్బాల్పై 17,028 మెజార్టీతో గెలిచారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఉరవకొండ విజయం దోబూచులాడింది. టీడీపీ, వైపీపీ అభ్యర్థుల మధ్య పోటాపోటీగా మెజార్టీ నడిచింది. ఆఖరికి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయం వైపుగా నడిచారు.