ముంబై : పాకిస్తాన్లోని బాలాకోట్లో భారత వైమానిక దళం జరిపిన దాడులను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. బాలాకోట్ దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉపయోగిస్తున్న భాష అనుచితంగా ఉందని ఆయన అన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని, నాలుగింట మూడు వంతుల మెజారిటీ సాధిస్తామని రాజ్నాథ్ చెప్పారు.