ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారు: యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2019, 02:02 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయవ్యవస్థనూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగపర విధుల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని యనమల అన్నారు. ప్రధాని అయినా, సామాన్యుడైనా చట్టం ముందు అందరూ సమానులేనని, ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిని ఎలా సస్పెండ్‌ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రుల హెలికాప్టర్లు సోదాలు చేస్తే చర్యలేవి? అని యనమల నిలదీశారు. కేబినెట్‌ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్‌కు లేదన్నారు. అప్పులు, వడ్డీరేట్లపై సీఎస్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమని యనమల వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com