ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంజనీరింగ్ యువతిపై అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2019, 12:48 PM

కర్ణాటకలోని రాయచూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంజనీరింగ్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన దుండగుడు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.


రాయచూర్ లోని నవోదయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతున్న యువతి కొన్నిరోజుల క్రితం అదృశ్యమయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాయచూర్ లోని మానిక్ ప్రభు ఆలయం వద్ద ఓ యువతి మృతదేహం చెట్టుకు వేలాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు.. చనిపోయిన అమ్మాయి.. అదృశ్యమైన అమ్మాయి ఒక్కరేనని తేల్చారు.


తొలుత ఈ యువతిని కిడ్నాప్ చేసిన అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారనీ, ఆ తర్వాత చిత్రహింసలు పెట్టారని పోలీసులు తెలిపారు. చివరగా యువతి చేత ఆత్మహత్య లేఖ రాయించి ఆమెను ఉరివేసి చంపేశారని పేర్కొన్నారు. మరోవైపు నిందితులపై అరెస్ట్ చేయాలంటూ ప్రజలు వీధుల్లోకి రావడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు సుదర్శన్ యాదవ్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com