మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ వేసిన నామినేషన్ చెల్లదంటూ ఎన్నికల అధికారులు తేల్చి చెప్పారు. మంగళగిరిలో ఉంటున్న నారా లోకేష్ కృష్ణా జిల్లా నుంచి నోటరీ తీసుకుని నామినేషన్ కు దాఖలు చేశారు. అయితే కృష్ణా జిల్లాలో తీసుకున్న నోటరీ గుంటూరు జిల్లాలో చెల్లదంటూ వైసిపి అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిశీలించిన అధికారులు లోకేష్ సమర్పించిన నోటరి చెల్లదని స్పష్టం చేశారు. నోటరీ చట్టంలోని సెక్షన్-9 ను ఈ సందర్భంగా అధికారులు ఉదహరించారు. 24 గంటల్లో లోకల్ నోటరి సమర్పిస్తే నామినేషన్ అమోదిస్తామని లోకేష్ కు తెలిపారు.