చెన్నై: జయ మేనకోడలు దీపా జయకుమార్ తన ఆస్తుల విలువ రూ.3.05కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. జయలలిత మృతితో ఖాళీ ఏర్పడిన ఆర్కే నగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉపఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా దీపా జయకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.3.05కోట్లుగా ఆమె పేర్కొన్నారు. వీటిలో రూ.1.05కోట్ల చరాస్తులు, రూ.2కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 2016-17 సంవత్సరంలో తనకు రూ.5.37లక్షల ఆదాయం వచ్చిందని, రూ.1.72 లక్షల విలువైన నాలుగు కేజీల వెండి, రూ.4లక్షల విలువైన 20 వజ్రాలు తన వద్ద ఉన్నట్లు ఆమె అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన వద్ద రూ.3.50లక్షల నగదు ఉందని, బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో రూ.1.77లక్షలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.