విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని జగన్కు లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఆరోపణలు రుజువు చేయలేక జగన్ పారిపోయారన్నారు. ముగ్గురు రైతుల దగ్గర 14 ఎకరాలు కొన్నామన్నారు. తనకు అగ్రిగోల్డ్తో ఎలాంటి సంబంధం లేదన్నారు. చేసిన ఆరోపణలు జగన్ నిరూపించలేకపోయాడన్నారు. ఉదయ్ దినకరన్ అగ్రిగోల్డ్లో డైరెక్టర్ మాత్రమేనన్నారు. ఉదయ్ దినకరన్ 6 ఎకరాలు అమ్మారన్నారు. ఐటీ రిటర్న్స్ ప్రకారమే భూములు కొన్నామన్నారు. హాయ్లాండ్ను వేలానికి తీసుకురావాలని ముందు కోరింది చంద్రబాబేనన్నారు.