విజయవాడ: గ్రామరెవిన్యూ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ధర్నాచౌక్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. గ్రామ రెవిన్యూ సహాయకుల జీతాలను పెంచాలని, ప్రమోషన్స్, నామినీలను విఆర్ ఏలు డిమాండ్ చేశారు. వీరి డిమాండ్లకు మద్దతుగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.... వీఆర్ ఏల సమ్యలపై రేపు అసెంబ్లీలో పోరాడతామని హామీ ఇచ్చారు. అనంతరం కార్యకర్తలు ఛలో సిఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడానికి చేసిన పలువురి నేతలైన రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఎన్. పెద్దన్న, ఎమ్.బాలకాశి, సిఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, సిఐటీయు రాష్ట్ర కార్యదర్శి ఏ. సుబ్బారావమ్మ, ప్రభాకరరావు, జయరాజు, సత్యన్నారాయణ పలువుని నేతలను పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేసి ధర్నాకు వచ్చిన వారిని భయబ్రాంతులకు గురిచేశారు.