ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క‌రువుపై 10 రాష్ట్రాల‌కు సుప్రీం స‌మన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2017, 04:57 PM

   న్యూఢిల్లీ: కరవుకు సంబంధించి ఏప్రిల్ 26న తమ ముందు హాజరుకావాలని 10 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు బుధవారంనాడు సమన్లు పంపింది. కరవు బాధిత ప్రజలకు తగిన పునరావాస, ఆర్థిక సాయాన్ని అందజేయాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ 'స్వరాజ్ అభియాన్' దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. కరువు ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో బిహార్, జార్ఖండ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఉన్నాయి. కరవు కేసులో తొలుత 12 రాష్ట్రాలున్నప్పటికీ ఉత్తరప్రదేశ్, ఒడిశాలను సుప్రీంకోర్టు తొలగించింది. జాతీయ ఆహార భద్రత (ఎన్‌ఎఫ్‌సీ) చట్టం కింద సబ్సిడీ ఆహారధాన్యాలు అందజేయాలని కరవు పీడిత రాష్ట్రాలను గత మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. కరవును ప్రకటించేందుకు నిరాకరించిన హర్యానా, గుజరాత్‌, బిహార్‌లను సుప్రీంకోర్టు బెంచ్ మందలించింది. దీంతో ఆలస్యంగానైనా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను కరవు ప్రాంతాలుగా గుజరాత్ ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com