దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పాటు స్థానికంగా కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర బాగా పెరిగింది. పది గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.29,350కి చేరింది. వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. కిలో వెండి ధర రూ.41వేల మార్కు దాటిపోయింది. నేటి మార్కెట్లో కిలో వెండి ధర రూ.550 పెరిగి రూ.41,500కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగినట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.25శాతం పెరిగి 1,247.30 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 0.20 శాతం పెరిగి 17.55డాలర్లకు చేరింది.