లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో సరికొత్త పొత్తు ఖరారైంది. అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే మహాకూటమిగా ఆవిర్భవించాయి. వచ్చే లోక్సభ ఎన్నికలతో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీచేయాలని నిర్ణయించాయి. మొత్తం 40 ఎంపీ స్థానాల్లో (తమిళనాడు 39 + పుదుచ్చేరి 1) బీజేపీ 5, పీఎంకే 6 స్థానాల్లో పోటీచేయనున్నాయి. మిగిలిన 29 స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేస్తుంది. పీఎంకేకు మరో రాజ్యసభ సీటును కూడా అన్నాడీఎంకే కేటాయించింది. చెన్నైలోని క్రోన్ ప్లాజా హోటల్లో బీజేపీ, అన్నాడీఎంకే నేతల మధ్య చర్చలు జరిగాయి. బీజేపీ నేత, కేంద్రమంత్రి పీయుష్ గోయెల్, తమిళనాడు సీఎం పళనిసామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో పాటు స్థానిక బీజేపీ నేతలు హాజరయ్యారు.