ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 12:20 PM

 ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారు. వేగంగా వస్తున్న ఓ అంబులెన్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై డివైడర్‌ను ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రా నుంచి నోయిడావైపు వెళ్లున్న అంబులెన్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మరో ఘటనలో ఓ కారు రోడ్డుపై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టి.. పక్కనున్న కాలువలో పడడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బులందర్‌షా సమీపంలోని అనూప్‌షహర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com