బీసీల అభివృద్ధి కోసం నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.43వేల కోట్లు కేటాయించి రూ.32వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. బీసీల అభివృద్ధి కోసం 11ఫెడరేషన్స్ కార్పొరేషన్గా మార్చారని తెలిపారు. గతంలో ఫించన్లు రూ.750 ఇవ్వలేనని చెప్పిన జగన్మోహన్రెడ్డి ఇప్పుడు బీసీలకు ఎలా న్యాయం చేస్తారని ఎద్దెవా చేశారు. బీసీలు రాజకీయంగా ఎదగాలని 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఎకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ, పింఛన్, పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందుతున్న వారిలో అత్యధికులు బలహీన వర్గాలవారేనని అన్నారు. బీసీల సంక్షేమం కోసం చంద్రన్న ఆదరణ పథకం ప్రవేశపెడితే.. బీసీలపై అక్కసుతో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆదరణ పథకాన్ని రద్దు చేశారని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్రెడ్డి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీసీల ఆదరణ చూరగొనలేక.. తెలంగాణ నాయకుల సాయంతో అక్కడి జనాన్ని బస్సుల ద్వారా తరలించారని మండిపడ్డారు. లోటు బడ్జెట్లో కూడా బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక ద్వారా రూ.35 వేలు ఇస్తున్నారని అన్నారు. 2014లో ఎన్నికల్లో వైసీపీ తరుపున కనీసం 10మంది బీసీలకు కూడా సీట్లు ఇవ్వలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి వెనుకబడిన వర్గాల పక్షాన దృఢంగా నిలబడిన పార్టీ అన్నారు. బీజేపీ, వైకాపాలు కొందరు వ్యక్తులను ప్రలోభపెట్టగలరు కానీ బడుగు బలహీన వర్గాల జన సమూహాన్ని తెలుగుదేశం పార్టీ నుండి వేరు చేయలేరన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు ఉండి మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత బీసీలకు ఉందని పేర్కొన్నారు.