రైతు సంక్షేమానికి ఉద్దేశించి రూపొందించిన ‘అన్నదాతా సుఖీభవ’ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ పథకంలో పెంచిన మొత్తాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. అందుబాటులో ఉన్న మంత్రుల నుంచి సంతకాలు తీసుకుని ఈ ఉత్తర్వులు విడుదల చేసింది. తొలి విడత ఇస్తామన్న రూ.4వేలల్లో కొంత రైతు ఖాతాకు జమ చేయనున్నారు. ఇవాళ లేదా రేపు రైతు ఖాతాల్లో నగదును జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నిక కోడ్తో ఇబ్బంది లేకుండా రైతు ఖాతాకు నగదును ప్రభుత్వం జమ చేయనుంది.