అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న లారీని కలిదిండి మండలంలోని ఫారెస్ట్ అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్కు తాబేళ్లను అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారం అందడంతో.. నిన్న రాత్రి కృష్ణా జిల్లా కలిదిండి మండలం మద్వానీ గూడెం వద్ద ఫారెస్ట్ అధికారులు నిఘా పెట్టారు. కలిదిండి మండలం మద్వాని గూడెం నుండి కలకత్తాకు తరలిస్తున్న 1100 తాబేళ్ల లారీని, ఇద్దరు నిందితులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులపై 1972 యాక్ట్ వన్య ప్రాణి చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నామని డిఆర్ఒ ప్రకాష్ తెలిపారు.