రేపటి కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రాకు కేటాయింపులు కనుక లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ప్రత్యేక హోదా ,విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. రేపటి బంద్ విజయవంతానికి ప్రతిపక్ష నాయకుడిని స్వయంగా కలిసి అడుగుతామని చలసాని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకై కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం.. ప్రతిపక్షనేత తో వ్యక్తిగతంగా మాట్లాడతా అని చెప్పినట్లు చలసాని శ్రీనివాస్ తెలియజేసారు. బంద్ విజయవంతానికి విద్యార్థి ,ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయని ఆయన వివరించారు.
ప్రత్యేక హోదా కు మద్దతు ఇస్తామని తెలంగాణ సిఎం కేసిఆర్ హామీ ఇచ్చారు కాబట్టి, హోదాకు మద్దతుగా తెలంగాణ లో ఒక రోజు బంద్ పాటించాలని చలసాని శ్రీనివాస్ కోరారు. బంద్ సందర్బంగా ఇంటర్ ప్రాక్టీకల్స్ ఒక రోజు వాయిదా వేసుకోవాలని మంత్రి గంటా శ్రీనివాస రావును కోరినట్లు ప్రత్యేక హోదా ,విభజన హామీల సాధన సమితి నేత చెప్పుకొచ్చారు. బిజెపిలో ఇద్దరు ముగ్గురు ఆంధ్రా ద్రోహులు ఉన్నారని, వారు తప్ప మిగిలిన వారందరి మద్దతు ఇవ్వాలని చలసాని శ్రీనివాస్ విజ్ఞప్తి చేసారు.