ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2017, 10:46 AM

అమరావతి: గుంటూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నరసరావుపేట మండలం పెదతురకపాలెంలో ప్రాంతీ రవాణా కార్యక్రమానికి, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో చంద్రబాబు బహిరంగసభ నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com