ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హార్దిక్‌ పాండ్యా విడాకులు..! ఆస్తిలో 70 శాతం వాటా ఇచ్చేందుకు గ్నీన్‌ సిగ్నల్‌

national |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 10:27 PM

గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్సీ పగ్గాలు వీడి.. ముంబై ఇండియన్స్‌ సారథిగా నియమితుడు అయినప్పటి నుంచి హార్దిక్‌ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. తన సారథ్యంలో ముంబై జట్టు ప్లే ఆఫ్స్‌ చేరకుండానే ఇంటిబాట పట్టింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి పరువు పోగొట్టుకుంది. దీంతో సొంత జట్టు అభిమానుల నుంచే పాండ్యా ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్న పాండ్యా.. ప్రస్తుతం రిఫ్రెష్ అవుతున్నాడు. అయితే తాజాగా పాండ్యాకు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది.


హార్దిక్‌ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ నుంచి విడిపోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల నటాషా తన ఇన్‌స్టా ఖాతాలో పాండ్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు ఊతం అందించింది. ఇన్‌స్టాలో కేవలం కుమారుడితో తాను ఉన్న చిత్రాలను మాత్రమే ఆమె ఉంచింది. యూజర్‌నేమ్‌లో పాండ్య అనే పదాన్ని కూడా తొలగించింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు వదంతులు మొదలయ్యాయి.


అంతేకాకుండా ఐపీఎల్‌ జరిగే సమయంలోనూ నటాషా కన్పించలేదు. ముంబై ఆడే మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియానికి రాలేదు. ముంబై ఇండియన్స్‌, హార్దిక్‌ పాండ్యాకు మద్దతుగా పోస్టులు సైతం చేయలేదు. ఇదే సమయంలో మార్చి 4న నటాషా పుట్టినరోజు సందర్భంగా హార్దిక్‌ పాండ్యా విష్‌ చేయకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ విడాకుల ప్రచారానికి బలాన్నిస్తున్నాయి!


ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి.. ఆస్తి పంపకాలపై కూడా స్పష్టత వచ్చినట్లు చెబుతున్నారు. విడాకుల్లో భాగంగా భరణం కింద హార్దిక్‌ పాండ్యా ఆస్తిలో 70% మేర ఇవ్వాలని నటాషా కోరిందని.. ఇందుకు అతడు కూడా అంగీకరించినట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై హార్దిక్‌ పాండ్యాగానీ, నటాషాగానీ స్పందించకపోవడం గమనార్హం.


కాగా 2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లో పాండ్యా.. సెర్బియా నటి నటాషా చేతికి ఉంగరం తొడిగి లవ్‌ ప్రపోజ్‌ చేసి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. 2020లో లాక్‌డౌన్‌లో తన భార్య గర్భిణి అని పాండ్యా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినప్పుడే అతడికి పెళ్లైందని తెలిసింది. పాండ్యా కుమారుడి పేరు అగస్త్య పాండ్య. అయితే గతేడాది పాండ్యా దంపతులు మరోసారి వివాహం చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్‌ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు పరిమిత సంఖ్యంలో క్రికెట్‌, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com