ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయిస్ ఛేంజ్ యాప్‌‌తో విద్యార్థులకు వల.. ఏడుగురిపై అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 10:28 PM

మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వాయిస్ ఛేంజ్ అనే యాప్‌ను ఉపయోగించి.. కళాశాల విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడుతున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల ఫోన్ నంబర్లు తీసుకుని వారికి ఫోన్లు చేసి.. లేడీ వాయిస్‌లో మాట్లాడి వారిని వలలో వేసుకునేవారు. ఆ తర్వాత వారిని తీసుకెళ్లి అత్యాచారం చేసేవారు. మొత్తంగా ఏడుగురు విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేసి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఓ సంచలన కేసు బయటికి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి అయిన బ్రిజేష్ ప్రజాపతి అనే వ్యక్తి వృత్తిరీత్యా కూలీ కాగా.. యూట్యూబ్‌లోని వాయిస్‌ ఛేంజింగ్‌ మ్యాజిక్‌ యాప్‌ గురించి చూసి దాన్ని ఉపయోగించడం ప్రారంభించాడు. అమర్వా గ్రామానికి చెందిన బ్రిజేష్ మద్వాస్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ ఇలాంటి ఘటనలకు పాల్పడేవాడు. ఈ ఘటనలో మరో నిందితుడైన విద్యార్థి సమీపంలోని ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నాడు. అయితే ప్రభుత్వ కాలేజీకి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి అమ్మాయిల ఫోన్ నంబర్లు సేకరించి నిందితులకు అందించేవాడు.


ఈ క్రమంలోనే బ్రిజేష్ ప్రజాపతితోపాటు అతని ఫ్రెండ్స్ రాహుల్ ప్రజాపతి, సందీప్ ప్రజాపతి, లవకుష్ ప్రజాపతి మరికొందరు ఆ నంబర్లకు ఫోన్లు చేసి.. కాలేజీలో పనిచేస్తున్న ఓ మేడం అని వారికి చెప్పి మాట్లాడేవారు. అయితే వారి మాటలు ఆ విద్యార్థినులు నమ్మడంతో.. తన కుమారుడిని పంపిస్తున్నానని.. స్కాలర్‌షిప్ కోసం అవసరమైన సర్టిఫికెట్లు తీసుకురండి అని ఓ విద్యార్థినికి చెప్పాడు. అది నమ్మిన ఆ విద్యార్థిని.. నిందితులు బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే అత్యాచారానికి పాల్పడ్డారు.


ఇదే తరహాలో మొత్తం ఏడుగురు విద్యార్థులను ట్రాప్ చేసి వారిపై లైంగిక దాడి చేసినట్లు రేవా రేంజ్ ఏడీజీ మహేంద్ర సింగ్ సికర్వార్ తెలిపారు. సిద్ధి జిల్లా మఝౌలీ పోలీస్ స్టేషన్‌కు ఓ మహిళ నుంచి కాల్ వచ్చిందని.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే నిందితులను పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నారు. ఆ నిందితుడిని విచారించగా.. ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థినులను బలిపశువులను చేసినట్లు తేలింది. ఇక ఇందులో నలుగురు విద్యార్థినులు ఒక్కొక్కరుగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో మరింత విచారణ చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com