సమాచార హక్కు చట్టానికి హాని చేసే సవరణలతో దాని ఉన్నతిని తగ్గించే ప్రయాత్నాలు విరమించుకోవాలని లేకుంటే దేశవ్యాప్తంగా ఉధ్యమాన్ని తీసుకువస్తామని ఆర్.టి.ఐ మాజీ కమీషనర్ లామ్ తాంతియా కుమారి హెచ్చరించారు. విజయవాడలోని వించ్ పేట, ఏనుగుల వారి వీధిలో ఫోరం ఫర్ ఆర్.టి.ఐ నిర్వహించిన అవగాహాన సదస్సుకు ఆమె ముఖ్యఅతిధగా హాజరై మాట్లాడుతూ ఇప్పటికే పేదవాని చేతులో పాశుపతాస్త్రంగా ఉండాల్సిన సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహాన కల్పించకపోగా చట్టానికి కత్తెర వేయాలని చూస్తే ప్రజా సంఘాలను కలుపుకుని దేశవ్యాప్త ఉధ్యమానికి శ్రీకారం చుడతామన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రత్యేక అతిధిగా హాజరైన ఫోరం ఫర్ ఆర్.టి.ఐ జాతీయ అధ్యక్షులు చేతన గ్రామీణ స్థాయికి సమాచార హక్కు చట్టాన్ని చేర్చి విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు తెలిపారు. సదస్సుకు ఫోరం ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.దయాసాగర్ అధ్యక్షత వహిస్తూ సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా చేపట్టేలా ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఫోరంఫర్ ఆర్.టి.ఐ మహిళా నాయకులు కామిరెడ్డి లలితాదేవి, కూరగంటి హనుమంతురావు, పి.చంద్ర మోహాన్, ఇమ్యాను యేలు తదితరులు పాల్గొన్నారు