గుడ్లూరు మండలం పొట్లూరు సమీపంలో రహదారిపై వ్యవసాయ కూలీల ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. గురువారం ఉదయం జరిగిన ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.కావలి మండలం అన్నగానిపాలెంకు చెందిన కూలీలు గుడ్లూరు మిర్చి కోతలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.