ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లో చొరబడి డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు.. బంగారం ఉన్నా టచ్ చేయలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 07:56 PM

ప్రకాశం జిల్లా ఒంగోలులో దొంగలు రెచ్చిపోయారు. నగరంలో ప్రముఖ న్యాయవాది నాగిశెట్టి మోహన్‌దాస్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి దేవుడిచెరువు పార్కు నివాసం ఉంటున్న న్యాయవాది మోహన్‌దాస్‌ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం నెల్లూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై రాత్రికి అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి వెనుక వైపు తలుపు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి చుట్టుపక్కల వారికి చెప్పారు. పోలీసులు వచ్చి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు.


దొంగలు దేవుడి గదిలో ఉన్న రూ.12 లక్షల డబ్బులు ఎత్తుకెళ్లారు. సుమారు 40 సవర్ల బంగారు ఆభరణాలున్నా వాటిని మాత్రం తీసుకెళ్లలేదు. ఇంట్లో ఉన్న డాబర్‌మన్‌ కుక్కకు మత్తు మందు ఇవ్వడంవల్లే అది మొరగలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. పని మనిషి ద్వారా సమాచారం అందుకున్న మోహన్‌దాస్‌ దంపతులు హుటాహుటిన ఒంగోలు వచ్చారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో వన్‌టౌన్ పోలీసులు దేవుడిచెరువు పార్కు వెనుకనే ఉన్న మోహన్‌దాస్‌ ఇంటికివెళ్లి పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. పోలీసు జాగిలాన్ని సైతం రప్పించి గాలించారు. బాధితుడు మోహన్‌దాస్‌ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com