విజయవాడ, సూర్య బ్యూరో : వ్యాట్ పరిధిలో ఉన్న డీలర్లంతా వస్తు సేవల పన్నులోకి మారడం కోసం వారి డిజిటల్ సంతకాలు తప్పనిసరి అని వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ-2 డివిజన్ డిప్యూటీ కమిషనర్ వి.రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. తప్పనిసరిగా ప్రతీ వ్యాట్ డీలరు డిజిటల్ సంతకాలు పొందాలని, లేకపోతే వారికి ఇన్పుట్ ట్యాక్స రాదన్నారు. డిజిటల్ సంతకాలు నమోదుకు తమ కార్యాలయంలో కౌంటర్ను ఏర్పాటు చేశారన్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫొటోలతో ప్రత్యేక కౌంటర్లో సంప్రదించి డిజిటల్ సంతకాలను నమోదు చేసుకోవాలని సూచించారు. బెంజిసర్కిల్, కష్ణలంక, మచిలీపట్నం, ఉయ్యూరు సర్కిల్ కార్యాలయంలో కూడా వ్యాపారస్తుల సౌలభ్యం కోసం కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.