తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి : ఏప్రిల్ 5వ తేది శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో అదే రోజు రాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం, ఏప్రిల్ 6న శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆనాడు ఆలయంలో నిర్వహించే వసంతోత్సవం, సహస్రదీపాలం కార సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా 6వ తేదిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కారణంగా వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది. మిగిలిన ఆర్జిత సేవలు యధావిధిగా కొనసాగుతాయి. శ్రీరామనవమి నాడు బంగారు వాకిలి చెంత రాత్రి 10 గంటలకు శ్రీరామనవమి ఆస్థానాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మరునాడు రాత్రి 8 గంటలకు ఇదే బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నే్తప్రర్వంగా నిర్వహించే ఈ రెండు కార్యక్రమాల్లో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.