విజయవాడ, సూర్య బ్యూరో : తాగునీటి అవసరాల కోసం ఈ ఏడాది వేసవిలో చెరువులను నింపుకునేందుకు జిల్లాలోని కాల్వలకు శనివారం అర్ధరాత్రి ప్రకాశం బ్యారేజి నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బందరు, ఏలూరు, కేఈబీ (దివిసీమ) కాల్వలకు తలా 500 క్యూసెక్కుల చొప్పున ఇస్తున్నారు. ఈ మూడు కాల్వలను ఒక సెక్టారుగా పరిగణించి, తొలుత నీటిని విడుదల చేశారు. మరో సెక్టారులో ఉన్న రైవస్ కాల్వకు ఇంకా నీరు విడుదల చేయలేదు. ఆదివారం సాయం్త్రం బ్యారేజి వద్ద 10.4 అడుగుల నీటి మట్టం ఉంది.