ఆస్ట్రేలియాలోని మూనీ బీచ్లో సముద్రస్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరొకరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణవాసులైన గౌసుద్దీన్(45), రాహత్(35) మృతదేహాలను వెలికితీశారు. గౌసుద్దీన్, జునేద్ నల్గొండ జిల్లా వాసులు కాగా.. రాహత్ హైదరాబాద్ బీహెచ్ఈఎల్ వాసి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.