తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత వైద్య చికిత్సకు అయిన ఖర్చు వివరాలను మంగళవారం అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమెకు అందించిన వైద్య చికిత్సకు మొత్తం మీద రూ.6.85 కోట్లు ఖర్చుచేసినట్లు అపోలో లండన్ డాక్టర్ రిచర్డ్ బీలే తెలిపారు. జయలలిత ఫిజియోథెరపీ కోసం సింగపూర్ ఆసుపత్రికి 1.29 కోట్లు, శశికళ కుటుంబ వసతి కోసం 1.24 కోట్లు, జయ లలిత ఆహారం కోసం 1.17 కోట్లు చెల్లించినట్లు డాక్టర్ రిచర్డ్ వెల్లడించారు. కాగా జయలలిత రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే