ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉన్నత చదువుల కోసం వెళ్లి.. యూకేలో అదృశ్యమైన భారత విద్యార్థి కథ విషాదాంతం

national |  Suryaa Desk  | Published : Sat, Dec 02, 2023, 09:50 PM

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నత విద్యకు వెళ్లి.. గత నెలలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి కథ విషాదాంతమైంది. 23 ఏళ్ల మిత్‌ కుమార్‌ పటేల్‌ లండన్‌‌లోని థేమ్స్ నదిలో శవమై తేలాడు. మిత్ మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన మిత్ కుమార్ పటేల్ ఉన్నత చదువుల కోసం సెప్టెంబరులో బ్రిటన్‌కు వెళ్లాడు. నవంబర్‌ 20 నుంచి షెఫీల్డ్‌ హాలమ్‌ యూనివర్సిటీలో చేరాల్సి ఉండగా.. అమెజాన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా సంపాదించాడు. ఈ క్రమంలో నవంబరు 17న వాకింగ్ కోసం వెళ్లిన మిత్.. ఇంటికి తిరిగి రాలేదు.


బంధువుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నవంబర్‌ 21న తూర్పు లండన్‌ కానరీ వార్ఫ్ ప్రాంతానికి సమీపంలోని థేమ్స్ నదిలో అతడి మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు గుర్తించారు. అతడి మరణానికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. కానీ, ఈ మృతి అనుమానాస్పదంగా లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మిత్‌కుమార్ బందువులు ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ ప్రారంభించారు.


మిత్ బంధువు పార్థ్ పటేల్ గతవారం గో ఫండ్‌లో విరాళాల సేకరణ ప్రారంభించగా.. ఇప్పటి వరకూ 4,500 పౌండ్లకుపైగా సమకూరాయి. గ్రామీణ ప్రాంతంలో నివసించే ఓ రైతు కుటుంబానికి చెందిన మిత్ ఉన్నత చదువుల కోసం యూకే వచ్చి నవంబరు 17న అదృశ్యమయ్యాడు.. నవంబరు 21 అతడు లండన్ కానరీ సమీపంలో శవమైన కనిపించాడు.. ఇది మాకు చాలా బాధాకరం.. కాబట్టి, మేము ఆ కుటుంబానికి సహాయం చేయడానికి నిధుల సేకరణ చేయాలని నిర్ణయించుకున్నాం.. అతడి మృతదేహాన్ని కూడా భారతదేశానికి పంపాం’ అని పార్థ్ అన్నారు. సేకరించిన నిధులను భారతదేశంలోని విద్యార్థి కుటుంబానికి సురక్షితంగా బదిలీ చేస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com