అత్యుత్తమ పర్యాటక గమ్యంగా ఏపీకి `పట్వా' పురస్కారం
విజయవాడ, మేజర్న్యూస్ : బెర్లిన్లోని అంతర్జాతీయ పర్యాటక వేదికపై ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఒక వెలుగు వెలిగింది. పర్యాటక, పెట్టుబడులు వంటి రంగాల్లో ఉత్తమ గమ్యంగా రాష్ట్రాన్ని గుర్తిస్తూ ఐక్య రాజ్య సమితి వరల్డ ట్రావెల్ ఆర్గనైజేషన్ ప్రతిష్ఠాత్మకమైన పట్వా (పసిఫిక్ ఏరియా ట్రావెల్ లైటర్సఅసోసియేషన్) అవార్డును ప్రకటించింది. ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్ చెరగని ముద్ర వేసిందనడానికి ఇదే తార్కాణమని పర్యాటక, సాంస్క తిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీకాంత్ వెల్లడించారు. పట్వా అవార్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆకర్షణగా నిలిచిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక వారసత్వ సంపదతో పాటు, పర్యాటక పరంగా సాధిస్తున్న అభివ ద్ధి, ఆకర్షణల వైపు అంతర్జాతీయ వేదిక దృష్టి సారించేలా చేసిన క షి మంచి ఫలితాలు ఇస్తోందనిఆంధ్రప్రదేశ్ పర్యాటక సాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిమాంశు శుక్లా చెప్పా రు. ఇక్కడి, సంస్కృతీ, సహజ సంపద, సముద్ర తీర ప్రాంతం, బౌద్ధ కాలం నాటి సంస్కృతీ వారసత్వాలు ప్రపంచానికి గొప్ప ఆకర్షణలుగా నిలిచాయని ఆయన వివరించారు. బెర్లిన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రదర్శన పలువురి ప్రశంసలు అందుకుందని హిమాంశు శుక్ల వెల్లడించారు. ఈ ఎక్సో్పలో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పర్యాటక సంస్థలు తమ విశిష్టతలను ప్రదర్శించాయి. మన దేశానికి చెందిన 15 రాష్ట్రాలు పాల్గొన్నాయి. అలాగే అనేక టూరిస్ట బోర్డులు, హోటళ్లు, విమాన సంస్థలు, కారు రెంటల్ కంపెనీలు పాల్గొన్నాయి. వృత్తి నైపుణ్యం కలిగిన ట్రావెల్ రైటర్లు 1998లో శ్రీలంకలో `పట్వా' ను ఏర్పాటు చేసారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రయాణ, పర్యాటక రంగ అభివద్ధి ప్రోత్సాహానికి ఈ సంస్థ ఏర్పాటు అయింది. పరిశ్రమ లో నాణ్యత నైపుణ్యాలు పెంచడానికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో కలిసి ఈ సంస్థ పనిచేస్తుంది. ఐక్య రాజ్య సమితి ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా `పట్వా' తన విధులను నిర్వర్తిస్తుంది.