న్యూఢిల్లి : రాజకీయాలనుంచి తాను విరమించడం లేదని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా లోక్సభకు పోటీ చేయడం లేదని ఆమె అన్నారు. సుష్మా స్వరాజ్ ప్రస్తుతం నాలుగవసారి లోక్సభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తాను లోక్సభకు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. కాగా రాజకీయాలనుంచి విరమించుకోవడం లేదని ఆమె ట్వీట్ చేశారు.