శబరిమల : నీలక్కళ్ నుంచి శబరిమల ఆలయానికి వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్న బిజెపి నేత కె సురేంద్రన్కు బెయిల్ మంజూరైంది. తిరువళ్లలోని కోర్టు సురేంద్రన్కు బెయిల్మంజూరు చేసింది. గతవారం నీలక్కళ్లో నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ శబరిమలకు వెళ్లడానికి పలువురు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. దీనిపై విమర్శలు చెలరేగాయి.