ఆలమూరు మండలంలోని జొన్నాడ ర్యాంపులో తిరిగి ఇసుక లావాదేవీలు సోమవారం ప్రారంభమైయ్యాయి. దీనిపై తహశీల్ధార్ కె.పద్మావతి మాట్లాడుతూ జియో కోఆర్డినేటర్ ద్వారా ముందు మైనింగ్ శాఖ హద్దులు నిర్ణయించినట్లు తెలిపారు. అందులో నీటి నిల్వలు ఉన్నందున గత వారం రోజులుగా ర్యాంపు నిలిచింది. దీనిపై వాటిని సరి చేసి ఇసుక లభ్యమయ్యే ప్రదేశాలను గుర్తించి హద్దుల వివరాలు మైనింగ్ అధికారులు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఇక ఇబ్బంది లేకుండా ఇసుక త్రవ్వకాలు పూర్తి చేయవచ్చు అన్నారు.