పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సమావేశం అనంతరం మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసిపనిచేస్తామని.. మమతా కూడా దేశంలో రాజ్యాంగ రక్షణకు కృషిచేస్తామన్నారన్నారు. ప్రజాస్వామ్య రక్షణకు కలిసి చర్యలు తీసుకుంటామని.. రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా ఈనెల 22న ఢిల్లీలో జరగాల్సిన బీజేపీయేతర పక్షాల సమావేశం వాయిదా పడిందని..జనవరిలో ఆ సమావేశం జరుగుతుందని.. ఆ సమావేశం అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.