కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అశోక్ గెహ్లాట్ కు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ నేత జేడీ శీలంలు స్వాగతం పలికారు. గెహ్లాట్ అక్కడి నుంచి విజయవాడ ఆంధ్రరత్న భవన్ కు బయల్దేరారు. సాయంత్రం 6గంటలకు సీఎం చంద్రబాబునాయుడుతో గెహ్లాట్ భేటీ కానున్నారు.