ఏపీ పోలీసులపై చంద్రబాబు ప్రభుత్వానికే నమ్మకం లేదని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసులను చవటలుగా మార్చారని ఆరోపించారు. ఏ దర్యాప్తులోనైనా పోలీసులు పోలీసుల్లాగా వ్యవహరించారా అని ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై చంద్రబాబుకు నమ్మకం లేదు కాబట్టే జెడ్ప్లస్ కేటగిరిలో ఆయన ఉన్నారని ఆరోపించారు. సిట్ నివేదిక అంటేనే నేరస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఆరు ఏడు సంఘటనలపై సిట్ దర్యాప్తు జరిపించారు వాటి నివేదికలు ఏమైనాయని ప్రశ్నించారు. విశాఖ భూకుంభకోణం సిట్ నివేదిక బయటకురాకుండానే గంటా శ్రీనివాస్ సీఎంకు ఎలా ధన్యవాదాలు చేబుతారని నిలదీశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కేసులో ఫోన్ ట్యాపింగ్పై సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. సిట్ అంటేనే టీడీపీ నేతలకు ఇచ్చిన సీల్డ్ కవర్లా మారిందని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.